టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పుల వల్ల టీవీల ధరలు బాగా తగ్గిపోయాయి. చైనాకు చెందిన పలు బ్రాండ్లు తక్కువ ధరలకే టీవీలను మార్కెట్లోకి తెస్తుండటంతో మిగతా బ్రాండ్లు కూడా టీవీ ధరలను తగ్గిస్తున్నాయి. దీంతో 15 వేల లోపే మంచి టీవీలు మనకు దొరుకుతున్నాయి. వీటిలో చాలా వరకు స్మార్ట్ టీవీలే ఉంటున్నాయి. 15 వేల లోపు టీవీ కావాలనుకునే వారి కోసం ఏయే టీవీలు ఉన్నాయో ఒకసారి చూడండి.
1. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో టాప్ బ్రాండ్లలో ఒకటైన ఎల్జీ 32 ఇంచుల స్మార్ట్ టీవీని 14,990 కే అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చిన ఈ టీవీ బరువు 6.3 కిలోలు. సంవత్సరం పాటు వారంటీ ఉంటుంది. ప్రస్తుతం షోరూంలతో పాటు ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంది.
2. టీవీల్లో బెస్ట్ బ్రాండ్లలో ఒకటైన సాంసంగ్ కూడా 32 ఇంచుల స్మార్ట్ ఎల్ఈడీ టీవీని బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టీవీ ధర ప్రస్తుతం అమెజాన్లో రూ.14,990గా ఉంది. వెబ్ ఓఎస్తో 2020లో లాంచ్ అయిన ఇది లైవ్ వెయిట్ టీవీ. దీని బరువు కేవలం 3.8 కిలోలు. సంవత్సరం వారంటీ ఉంటుంది.
3. కెమెరాల్లో టాప్ బ్రాండ్గా ఉన్న కొడాక్ టీవీలను కూడా తయారుచేస్తోంది. 32 ఇంచుల ఎల్ఈడీ స్మార్ట్ హెచ్డీఆర్ టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర ప్రస్తుతం 11,499గా ఉంది. 24 వాట్ స్పీకర్లతో, ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్తో అందుబాటులోకి వచ్చిన ఈ టీవీ 5.8 కిలోల బరువు ఉంటుంది. సంవత్సరం వారంటీ ఉంది.
4. మొబైల్ రంగంలో వన్ప్లస్ బ్రాండ్కు బాగా క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సంస్థ స్మార్ట్ టీవీలను కూడా ఉత్పత్తి చేస్తోంది. వై సిరీస్లో 15 వేల రూపాయలకు 32 ఇంచుల హెచ్డీఆర్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం ఇది ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్తో 2020లోనే ఈ టీవీ లాంచ్ అయ్యింది. 3.5 కిలోలు ఈ టీవీ బరువు. సంవత్సరం వారంటీ ఉంటుంది.
5. మొబైల్ రంగంలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఎంఐ కంపెనీ స్మార్ట్ టీవీల్లో కూడా మార్కెట్ లీడర్గా ఎదుగుతోంది. బడ్జెట్ ప్రైస్లో కేవలం 12,999కే ఎంఐ 4ఏ ప్రో టీవీని మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంచుమించు ఇదే ధరలో ఎంఐ కొత్త మోడల్ హారిజాన్ వేరింట్లోనూ స్మార్ట్ టీవీ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ఈ టీవీలకు సంవత్సరం వారంటీ ఉంటుంది.