నాలుగు దేశీయ ప్రధాన ఎయిర్లైన్స్ ఇండిగో, స్పైస్జెట్, గోఎయిర్, ఎయిర్ఏసియా ఇండియాలు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి చెల్లించా ల్సిన బకాయిలు ఫిబ్రవరి – జులై కాలంలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. కరోనా నేపథ్యంలో ఈ బకాయిలు పేరుకుపో యాయని ఓ సీనియర్ అధికారి వెల్ల డించారు. దేశీయ విమానయాన సం స్థలు ఏఏఐకి పెద్ద మొత్తం లో బకాయిలు చెల్లిం చాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి జులై మధ్యకాలంలో 2.75 శాతం మేర పెరిగి రూ. 2,258.27 కోట్లకు పెరిగాయని అధికారి వివరించారు. దాదాపు 100కుపైగా ఎయిర్పోర్టుల్లో ఎయిర్ నావిగేషన్, ల్యాండింగ్, పార్కింగ్ లాంటి సేవల విని యోగానికిగానూ ఏఏఐకి ఎయిర్లైన్ సంస్థలు ఛార్జీలు చెల్లించాల్సి ఉం టుంది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ కింద ఎయిర్ ఇండియా, ఏఏఐ పనిచేస్తాయి. భారత్లో ప్రధానంగా ఆరు ప్రధాన దేశీయ క్యారియర్లు ఉన్నాయి. ఇండిగో, స్పైస్జెట్, గోఎయిర్, ఎయిరేసియా ఇండియా, ఎయిరిం డియా, విస్తారా ఆగస్టు 1 నాటికి రూ.2562.04 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.