కర్నూలు జిల్లా వ్యాప్తంగా 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హులై ఉండి, దరఖాస్తు చేసుకోని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని డీఆర్డీఏ పీడీ ఎం.కె.వి.శ్రీనివాసులు తెలిపారు.శనివారం ఆయన మాట్లాడుతూ అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 'వైఎస్ఆర్ చేయూత' ద్వారా అందిన డబ్బును మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వ శాఖలతో కలిపి ఈ నెల 31వ తేదీన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఒక సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు.