సెప్టెంబర్ 26వ తేదీన జరిగే సచివాలయం పరీక్షలకు తమకు అవకాశం కల్పించాలని వెటర్నరీ డిప్లొమా విద్యార్థులు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆదివారం వినతి పత్రం ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసే నాటికి కరోనా లాక్డౌన్తో రెండవ సంవత్సర పరీక్ష ఫలితాలు ఆలస్యం అయ్యాయన్నారు. అయినప్పటికీ వెటర్నరీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తమ సర్టిఫికెట్ అప్లోడ్ అవకాశం కల్పిస్తే తమకు సచివాలయ హాల్ టికెట్లు వస్తాయని, పరీక్షలు రాసుకోవడానికి అర్హులవుతామన్నారు. పశుసంవర్ధక, సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి, శివ, పుల్లయ్య పాల్గొన్నారు.