తమిళనాడులోని అధికారిక అన్నాడీఎంకేలో గ్రూపు వార్ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు చెడిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దిండుగల్లో వెలసిన పోస్టర్లు వారి మధ్య మరింత ఎడం పెంచేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. డిప్యూటీ పళనిస్వామి అంటూ ఆ పోస్టర్లలో రాసుకొచ్చారు. 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఫలానా అంటూ మంత్రులు సెల్లూరు రాజు, కేటీ రాజేంద్ర బాలాజీలు భిన్న వాదనలు తెరపైకి తేవడంతో వివాదం రాజుకుంది. నిన్న దిండుగల్లో వెలసిన పోస్టర్లు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి.