కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం డ్యాం 10 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పర్యాటకులు ఆ దృశ్యాన్ని చూసేందుకు శ్రీశైలానికి క్యూ కడుతున్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్ శ్రీశైలం డ్యాంకు చేరుకొని నీటి విడుదలను పరిశీలించనున్నారు. శ్రీశైలం నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుంటుంది. నేడు సాయంత్రానికి నాగార్జున సాగర్ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంది. సాగర్ లో మాత్రం పర్యాటకులకు ప్రభుత్వం అనుమతించలేదు.