కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్దిరోజులుగా జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. మెున్నటి వరకు కరోనా దెబ్బకు పట్టణాలన్నీ వణికిపోయాయి. తాజాగా కరోనా దెబ్బకు పల్లెటూర్లు సైతం వణికిపోతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలో 805 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,381కి చేరుకున్నాయి.ఇకపోతే జిల్లాలో 6,899 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్సపొందుతుండగా 29,168 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి 308 మంది మృతి చెందారు. తాజాగా మరో ఆరుగురు మృతి చెందడంతో ఆ సంఖ్య 314కి చేరింది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను పెంచింది.