ఆదోని పట్టణంలో 22, రూరల్లో 1 కేసులతో నియోజకవర్గంలో శనివారం 23 కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. కేసులు పెరుగుతుండటంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కిల్చిన్పేట 6, ఇందిరానగర్ 5, ఆర్టిసి కాలనీ 3, పోస్టల్ కాలనీ 1, పోలీస్ క్వార్టర్స్ 1, హనుమాన్నగర్ 1, అమరావతి నగర్ 1, మాధవరం రోడ్డు 1, శంకర్ నగర్ 1, ఎంఐజి కాలనీ 1, సాయిబాబా నగర్ 1, రూరల్లో మండిగిరి 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి మందులేదని, స్వీయ జాగ్రత్తలు పాటించి కుటుంబాలను రక్షించుకొని సమాజాన్ని కాపాడుకుందామని అధికారులు సూచిస్తున్నారు.