ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ఫొటోను ఆ​ ప్రచారానికి వాడుకోకండి

national |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 12:29 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఒకే దేశం- ఒకే మార్కెట్' ఆర్డినెన్సును రద్దు చేయాలని పంజాబ్​లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకే దేశం- ఒకే మార్కెట్​పై కేంద్రం జారీ చేసిన పోస్టర్ ప్రకటనలో తన ఫొటోను ఉపయోగించడంపై ఫరీద్​కోట్​కు చెందిన గుర్​ప్రీత్​ సింగ్ అనే రైతు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ ఆర్డినెన్సును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గుర్​ప్రీత్. పోస్టర్లపై తన ఫొటోను సైతం తొలగించాలని స్పష్టం చేశారు.రైతులకు ప్రయోజనాలు కలిగించే సంక్షేమ పథకాలపై తన ఫొటోను ప్రచురిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ ఈ ఆర్డినెన్స్ ప్రచార పత్రాలపై తన ఫొటో ఉపయోగించడం మాత్రం ఇష్టంలేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com