ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర ప్రైవేటు బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అలర్ట్ అయ్యేలోపే మంటలు వ్యాపించి ఐదుగురు సజీవదహనమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు,ఒక మహిళ ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 32 మంది ఉన్నారు. బస్సు బెంగుళూరు నుంచి విజయపుర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు. ఈ ప్రమాదానికి గల మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.