ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సుకు మంటలు..ఐదుగురు సజీవ దహనం

national |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 12:21 PM

ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర ప్రైవేటు బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అలర్ట్ అయ్యేలోపే మంటలు వ్యాపించి ఐదుగురు సజీవదహనమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు,ఒక మహిళ ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 32 మంది ఉన్నారు. బస్సు బెంగుళూరు నుంచి విజయపుర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు. ఈ ప్రమాదానికి గల మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com