ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192.83 పాయింట్లు లాభపడి 28,661.58 వద్ద, నిఫ్టీ 57.50 పాయింట్ల లాభంతో 8,879.20 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. ఉదయం స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ 40 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 8.85 పాయింట్లు పడిపోయి ట్రేడింగ్ను కొనసాగించాయి. అనంతరం టెలికాం, వినియోగ వస్తువులు, లోహ, ఆయిల్, గ్యాస్, విద్యుత్, స్థిరాస్తి, హెల్త్కేర్ రంగాల షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించడంతో మార్కెట్ తిరిగి కోలుకుంది. చివరి వరకూ అదే జోరును కొనసాగించిన సూచీలు లాభాలతో ముగిశాయి.
సోమవారం నాటి ట్రేడింగ్లో టాటా స్టీల్, టీసీఎస్, బీపీసీఎల్, గెయిల్, ఐడియా సెల్యులార్ తదితర షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంకు, బాష్, యెస్ బ్యాంకు ఐటీసీ, టెక్ మహీంద్రా మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.