సెల్ఫోన్లు ఈ మధ్య చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. తమిళనాడులో సెల్ ఫోన్ వల్ల ఓ విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన ఘటన కరూర్ జిల్లాలో చోటు చేసుకుంది. సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇద్దరు పిల్లలతో కలిసి ముత్తులక్ష్మీ అనే మహిళ నిద్రలోకి జారుకుంది. రాత్రి సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టి కుటుంబం అంతా నిద్రపోయింది. ఫోన్ ఒక్కసారిగా పేలటంతో ఇంట్లోమంటలు సెలరేగటంతో తల్లీ…ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈప్రమాదంలో మృతులు ముత్తులక్ష్మి, అతని కొడుకులు రంజిత్,దక్షిత్ లు చనిపోయారు. ఈ ప్రమాదంలో పిల్లలు అక్కడిక్కడే చనిపోగా తల్లి ముత్తు లక్ష్మి మాత్రం ప్రాణాలతో కొట్టుకుంటూండగా హాస్పిటల్ కు తరలించగా చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పేలిన ఫోన్ చైనాదని చార్జింగ్ ఎక్కువ కావటంతో అది పేలిపోయిందని పోలీసులు తెలిపారు. రాత్రి పడుకునే సమయంలో ఫోన్ తన వద్దనే చార్జింగ్ పెట్టారని అది పేలిపోవటంతో మంటలు వ్యాపించి బెడ్ షీట్స్..రూమ్ కరెన్స్ కు మంటలు వ్యాపించాయనీ..ఫోన్ పేలుడు ధాటికి చిన్నారులిద్దరు అక్కడిక్కడే మృతి చెందారనీ..తల్లిని మాత్రం హాస్పిటల్ కు తరలించగా చికిత్స తీసుకుంటూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఇకనైనా రాత్రి సమయంలో సెల్ ఫోన్లకు చార్జింగ్ పెట్టి ఉంచొద్దని పోలీసులు గ్రామస్తులకు సూచించారు.