తాను చూపించే అప్పడాలు తింటే కరోనా రాదని చెప్పి మీడియాలో కలకలం సృష్టించిన కేంద్రమంత్రి ఆర్జున్ రామ్ మేఘ్వాల్ తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నట్లు కొవిడ్ లక్షణాలు బయటపడటంతో రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నట్లు, రెండో సారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. నాతో కాంటాక్ట్లో ఉన్నవారు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి’ అని పేర్కొన్నారు.
జులై చివరి వారంతో భాజపా మంత్రి అర్జున్ రామ్ మేఫ్వాల్కు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పాపడ్లో యాంటీ బాడీలు ఉంటాయని, అవి కరోనాను నివారిస్తాయని ఆ వీడియోలో పేర్కొన్నారు.