తన పైఅధికారం వేధిస్తున్నాడని ఓ వ్యక్తి అతడి ఫోన్ నెంబర్ ను వ్యభిచార వెబ్ సైటులో పెట్టాడు. అంతటి ఆగ లేదు. అతని కుటుంబ సభ్యుల పేరిట శృంగార టాయ్స్ ఆర్డర్ చేశాడు. దీంతో ఆ బాస్ జరిగిన నిర్వాకానికి బోరున విలపించాడు. నిందితుడు రియాల్టీ, కాఫీ ట్రేడింగ్ కంపెనీలో ఉద్యోగి. తన ప్రావిడెంట్ ఫండ్ ను క్లియర్ చేయకపోవడంతో ఆ వ్యక్తి తన యజమానిపై కోపం పెంచుకున్నాడు. బాధితుడు అవినాష్ ప్రభు కల్మనే ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్. నిందితుడిని హరిప్రసాద్ జోషిగా గుర్తించారు. చాలా కాలంగా, జోషి తన పిఎఫ్ మొత్తాన్ని విడుదల చేయమని తన యజమాని అవినాష్ ప్రభును కొంత కాలంగా కోరుతున్నాడు. అయితే, లాక్ డౌన్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని జోషికి తెలిపాడు. అవసరమైన పత్రాలను సమర్పించలేదని, అందువల్ల చెల్లింపు విడుదలలో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి ముగిసిన తర్వాత చెల్లింపు చేస్తానని ప్రభు హామీ ఇచ్చాడు. అయినా జోషి వినిపించుకోలేదు. జోషి కోపంతో రెచ్చిపోయి బాస్ కు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. జోషి తన యజమాని భార్య, పిల్లల ఫోన్ నంబర్లను డేటింగ్ వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడు. వారి పేర్లతో సెక్స్ టాయ్స్ కూడా ఆర్డర్ చేశాడు. విషయం తెలుసుకున్న ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారి దర్యాప్తులో జోషిని దోషిగా గుర్తించారు. ఐపిసి తో పాటు ఐటి చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.