ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాతో వ్యక్తి మృతి భార్యను వెళ్లగొట్టిన ఇంటి యజమాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 08, 2020, 03:46 PM

కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి భార్యను వారుంటున్న ఇంటి యజమాని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న ‌అమానవీయ ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది. పట్టణంలోని కట్టెల వీధికి చెందిన నాగేశ్వరరావు కరోనా పరీక్షలు చేసుకోగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం మృతి చెందారు. అతడి భార్య ఉదయం ఇంటికెళ్లగా రానీయకుండా ఇంటి యజమాని అడ్డుకున్నారు. ఇంటికి తాళం వేయడంతో ఆమె లగేజీతో బయటే కూర్చొని రోధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com