ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాగ్ కొత్త అధిపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 08, 2020, 01:13 PM

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​(కాగ్)గా గిరీశ్ చంద్ర ముర్ము బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ముర్మును సీఏజీగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్టు 6న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు​ సీఏజీగా ఉన్న రాజీవ్ మెహర్షి శుక్రవారం పదవీ విరమణ చేశారు.  జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బుధవారం సాయంత్రం ముర్ము రాజీనామా చేశారు. దీంతో ఆయన నూతన కాగ్​గా నియమితులవుతారని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com