మున్సిఫ్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ ఖాన్ లతీఫ్ ముహమ్మద్ ఖాన్ అమెరికా దేశంలోని చికాగో నగరంలో గురువారం రాత్రి కన్నుమూశారు. 80 ఏళ్ల ఖాన్ గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సుల్తాన్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ అయిన ఖాన్ కు బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్, స్వర్గీయ జైపాల్ రెడ్డి తదితరులతో స్నేహబంధం ఉండేది. గత కొన్ని నెలలు హైదరాబాద్ నగరంలోనే ఉన్న ఖాన్ మూడు వారాల క్రితమే అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని చికాగో నగరంలో అనారోగ్యానికి గురై మరణించారు. లతీఫ్ ఖాన్ కు నగరంలోని నడిబొడ్డున ఎల్ బి స్టేడియం ఎదురు ఎస్టేట్ ఉంది. లతీఫ్ ఖాన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు