ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్టోబర్ 15 నుంచి కళాశాలలు తెరచుకోనున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. సెప్టెంబర్లో సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్న ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఉన్నత విద్య విధానంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ను 80 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో పది నెలలపాటు అప్రెంటిస్షిప్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఆపై మరో ఏడాదిపాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించే కోర్సుల బోధన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆనర్స్ డిగ్రీ చేపట్టునున్నట్లు తెలిపారు. అదే విధంగా అక్టోబర్ 15 నుంచి కళాశాలలు తెరచుకోనున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. సెప్టెంబర్లో సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్న ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.