ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్కుమనిషి ‘ఇందిర’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2017, 12:59 AM

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధిఃయూపీ పీసీసీ అధ్యక్షుడు, నటుడు రాజ్‌జబ్బార్‌  మాట్లాడుతూ  ఇందిరమ్మ ఉక్కు మనిషని ఆమె దేశాన్ని ఒక పటిష్టమైన దేశంగా రూపొందించారని అన్నారు. ఇందిరమ్మ ఆశయాల సాధన ఈ దేశానికి ఎంతో ఉపయోగమని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇలాంటి రన్‌ కార్యక్రమాలు నిర్వహించడం  వల్ల యువతలో ఇందిరమ్మ పట్ల సంపూర్ణమైన అవగాహన ఏర్పడు తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  ఇందిరాగాంధీ ఆశయాలను సాధించేం దుకు ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త నిరంతరం కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రపంచపటంలో ముందు  ఇందిరాగాంధీ నిలిపారని, , దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఇందిరమ్మ చేసిన సేవలు మరవలేనివని, నేటి తరం ఇందిరాగాంధీ గురించి తెలుసుకొని ఆమె చూపించిన బాటలో నడవాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎం. అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల సందర్బంగా  ‘మా తుజే సలాం-రన్‌ ఫర్‌ ఇందిరా’పేరిట  నగరంలోని నెక్లెస్‌ రోడ్డులో 10కె, 5కె, 2 కె రన్‌ను నిర్వహించారు. 


ఈ సందర్భంగా యు.పి పిసిసి అధ్యక్షులు, యూపీ పీసీసీ అధ్యక్షుడు హిందీ నటులు రాజ్‌జబ్బార్‌,  సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ, ఉప నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యా రాయణ,.ఎమ్మెల్యే,  సంతప్‌ కుమార్‌, మాజీ మం త్రులు దానం నాగేందర్‌, సునితా లక్ష్మారెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇందిరాగాంధీ దేశాభి వృద్ధికోసం విప్లవాత్మకమైన చర్యలు తీసుకు న్నారని, దేశాన్ని పటిష్టమైన దేశంగా నిలబెట్టారని కొనియాడారు.   నేడు దేశం ప్రపంచలోని అనేక దేశాలకు వస్తువులను, సాంకేతక పరిజ్ఞానాన్ని ఎగుమతి చేయగలుగుతుందంటే అది ఖచ్చితంగా ఇందిరమ్మ చేసిన ఘనతేనని ఆయన కొని యాడారు.  యవజన కాంగ్రెస్‌ అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఇందిరాగాంధీ శత జయంతి కార్యక్రమాలు ఇంతపెద్ద ఎత్తన విజయ వంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. యువజనుల్లో ఇందిరమ్మ ఆశయాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని, ఈ కార్యక్రమంతో యువతలో ఇందిరమ్మ పట్ల ఎంత అభిమానం ఉందో తెలుస్తుందని అన్నారు. యువత ఇందిరమ్మ ఆశ యాలను ఆదర్శంగా తీసుకొని ముందకుపోవాలని పిలుపునిచ్చారు. అనంతరం 10కె, 5కె, 2కె పరుగులలో విజయం సాధించిన వారికి  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com