ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన బంగారం ధర!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 06, 2020, 03:41 PM

బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్ రూ.57,000 దాటితే, వెండి రూ.71,000 మార్క్ దాటేంది. మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.99 శాతం అంటే రూ.541 పెరిగి రూ.55,092 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో వెండి ధర రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఒక్క రోజే రూ.2,061 పెరిగింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.71,000 మార్క్ దాటింది. వెండి ధర 2.95 శాతం అంటే రూ.2,061 తగ్గడంతో రూ.71,858 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు మామూలుగా లేవు. రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. స్వచ్ఛమైన బంగారం ధర రూ.57,000 దాటింది. 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.1,010 పెరిగి రూ.57,820 ధరకు చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం రూ.53,000 దాటింది. 10 గ్రాములపై రూ.930 పెరిగి రూ.53,010 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో వెండి ధర ఒక్క రోజులోనే రూ.6,000 పెరిగింది. రూ.71,000 మార్క్ దాటింది. ఈరోజు కిలో వెండిపై రూ.6,450 పెరగడంతో ప్రస్తుతం రూ.71,500 ధరకు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2035 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 26 డాలర్లు. మార్చిలో మొదలైన బంగారం, వెండి ధరల పరుగు ఆగట్లేదు. కరోనా వైరస్ సంక్షోభంలో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే బంగారం, వెండి ధరలు మాత్రం దూసుకెళ్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com