ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..

national |  Suryaa Desk  | Published : Thu, Aug 06, 2020, 02:02 PM

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాల్ని తీసుకొచ్చింది. అందులో కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ప్రారంభించారు. రైతులకు ఆర్థికంగా సాయం చేయాలన్న లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ యోజన కూడా కేంద్ర సర్కార్ ప్రారంభించింది. కిసాన్ క్రెడిట్ కార్డస్ ఉన్న వారందరికీ రుణాలు కూడా అందిస్తోంది. అయితే ప్రధాని కిసాన్ సమ్మన్ నిధి పథకం.. కెసిసి-కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం లబ్ధిదారుల మధ్య సుమారు 2.5 కోట్ల మంది అంతరం ఉంది. ఈ రైతులకు కెసిసి అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల రూపాయల సులువు మరియు రాయితీ క్రెడిట్ లభిస్తుంది. రైతులు మనీల్యాండర్స్ నుంచి రుణం తీసుకుంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రుణం నుంచి రైతు త్వరగా బయట కూడా పడలేడు. అలాంటి ఇబ్బందుల్లో అన్నదాతలు పడకూడదనే ఉద్దేశంతోనే రైతు రుణాల్ని ప్రారంభించింది ప్రభుత్వం. సర్కార్ అందిస్తున్న ఈ రుణం తీసుకునేటప్పుడు, ఏటా 4 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు, ఇది దేశంలో అన్నిరకాల రునాలపై అందిస్తున్న వడ్డీ రేట్ల కంటే అతి తక్కువ రేటు అన్నారు మంత్రి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com