గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో గురజాల రూరల్ సీఐ ఉమేష్ ఆధ్వర్యంలో.. భారీగా అక్రమ మద్యం పట్టుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పొందుగల బోర్డర్ వద్ద నిఘా పెంచిన రురల్ సిఐ ఉమేష్.. తెలంగాణ నుండి మద్యం తరలిస్తున్న అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. తెలంగాణ నుండి లారీలో ఆంధ్రాకు తరలిస్తున్న 37 కేసుల మద్యాన్ని పట్టుకున్నారు.