అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై టీనేజర్ అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన ఏపీలో చోటుచేసుకుంది. టిఒఐ కథనం మేరకు..చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై టీనేజ్ యువకుడు(17) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికకి మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. బంధువుల యువకుడే కావడంతో మామూలుగానే ఇంటికి వచ్చాడనుకుంది. అయితే ఆమెపై కన్నేసిన కామాంధుడు మాయమాటలతో మభ్యపెట్టి రేప్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు ముభావంగా ఉన్న కూతురిని ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన దాష్టీకాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం జిల్లా వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.