ఏపీ సీఎం జగన్ కు గుడి కడుతున్నారు. అవును మీరు విన్నది నిజం అయోధ్య రామయ్య గుడికి నేడు శంకుస్థాపన జరిగినట్టే ఏపీలో సీఎం జగన్ గుడికి శంకుస్థాపన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో సీఎం జగన్కు వైసీపీ నేతలు గుడి కట్టిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్ను దేవుడిలా కొలిచేందుకు గుడిని నిర్మిస్తున్నామని స్థానిక వైసీపీ నేత కురకూరి నాగేశ్వర్రావు చెప్పారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఈ ఆలయ రూపంలో చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు.