ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడ్వాణీ, జోషీకి అందిన ఆహ్వానం

national |  Suryaa Desk  | Published : Mon, Aug 03, 2020, 10:16 AM

అయోధ్యలో ఈ నెల 5న జరగనున్న రామ మందిర భూమి పూజకు భాజపా అగ్ర​ నాయకులు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషికి ఆహ్వానం అందింది. వారికి ఆహ్వానం అందించినట్లు ఆలయ ట్రస్ట్​ అధికారి ప్రకాశ్​ కుమార్​ గుప్తా తెలిపారు. వారిని ఆహ్వానించలేదని వచ్చిన వార్తలు కేవలం వదంతులేననని కొట్టిపారేశారు. వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశారు. అడ్వాణీ, జోషీ సహా మరికొందరు ప్రముఖులకు మెయిల్​, ఫోన్​ ద్వారా సమాచారం అందించామన్నారు.కరోనా కారణంగా ఎక్కువ మంది పూజలో పాల్గొనకపోవచ్చు, మరికొందరికి ప్రయాణ ఇబ్బందులు ఉండవచ్చన్నారు. అంతేకానీ మేము వారిని పిలవలేదనే మాటల్లో వాస్తవం లేదన్నారు. అందరి మనోభావాలను గౌరవించడమే ట్రస్ట్​ విధి అని ప్రకాశ్​ కుమార్​ స్పష్టం చేశారు. పోస్ట్​ ద్వారా పంపే ఆహ్వానం సమయానికి చేరుకుంటుందనే నమ్మకం లేదన్నారు. అందుకే ఫోన్​ చేసి ఆహ్వానించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com