రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇకపై వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అందించిన సిఫార్సులను ఆమోదిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం ఏడాదిగా మద్యం మత్తులో వాహనం చేసినా, అంబులెన్స్లకు దారి ఇవ్వకపోయినా రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు ఇప్పుడు మొబైల్ మాట్లాడుతూ వాహనాన్ని నడపడాన్ని కూడా రూ.10 వేల జరిమానా పరిధిలోకి యూపీ ప్రభుత్వం చేర్చింది.సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనానని నడుపుతూ మొదటి సారి పట్టుబడితే రూ.1000, రెండోసారి ఇలానే చేస్తూ రూ.10 వేలు జరిమానా విధిస్తారు.దీంతో పాటు హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారును నడపడం చేస్తే ఇప్పటి వరకు ఉన్న జరిమానాను డబల్ చేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.500, సీటు బెల్ట్ లేకుండా కారు డ్రైవ్ చేస్తే రూ. వేయి, పార్కింగ్ నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి రూ.500, రెండోసారి రూ.1500, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు, స్పీడ్ లిమిట్ను దాటితే రూ.4000, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే రూ.10 వేలు జరిమానా విధించనున్నారు. వాహనాల డిజైనింగ్లో అక్రమంగా మార్పులు చేసి విక్రయిస్తే రూ.1 లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు యూపీ సర్కార్ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.