ట్రెండింగ్
Epaper    English    தமிழ்

19 ఏళ్ల పక్కింటి యువతితో పరారైన వృద్ధుడు...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 12, 2020, 07:54 PM

మనవరాలి వయసున్న యువతితో కలసి ఓ వృద్ధుడు ఇల్లు వదిలి పారిపోయాడు. గుజరాత్‌లోని పఠాన్ జిల్లాలో సిధాపూర్ తాలూకాలో ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. జూన్ 2న యువతి బయటకు వెళ్లివస్తానని చెప్పి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు. అదే సమయంలో పక్కింట్లో ఉండే వృద్ధుడు కూడా కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలో బాధితురాలి సోదరుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. యువతిని ముసలి వ్యక్తి అక్రమంగా నిర్బంధించాడని, ఆమెను లైంగికంగా కూడా వేధింపులకు గురి చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా యువతిని కాపాడాలని కోరారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. బాధితురాలిని వెతికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. జూన్ 29న కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉండగా, పోలీసులు సఫలం కాలేదు. దీంతో మరో రెండు వారాలు గడువు ఇచ్చింది న్యాయస్థానం. ఈనెల 13వ తేదీ లోపు పోలీసులు ఆమెను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com