భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా 151వ బెటాలియన్ కు చెందిన 30 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా సోకినట్లు నిర్దారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. చర్ల సరిహద్దులో కలివేరు వద్ద బెటాలియన్ ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన జవాన్లు రెండు వారాల క్రితం బెటాలియన్ లో రిపోర్టు చేశారు. గురువారం 23 మంది జవాన్లకు పాజిటివ్ రాగా, శుక్రవారం మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా సోకిన జవాన్లను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.