మధ్యప్రదేశ్లోని రేవాలో ఏర్పాటైన ఆసియాలోనే అతిపెద్దది అయిన 750 మెగా వాట్ల సౌర విద్యుత్ పార్క్ను శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని.. సోలార్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ (ఆర్యూఎంఎస్ఎల్), మధ్యప్రదేశ్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్, భారత సోలార్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ పార్క్ను నిర్మించాయి. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో భారత్కు ఉన్న అనుకూలతలను మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు.అతిపెద్ద ప్లాంట్ నిర్మాణంతో భారత్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. శుద్ధమైన విద్యుత్కు అత్యంత ఆకర్షణీయ మార్కెట్ భారతేనని వెల్లడించారు. రేవాలోని సౌర విద్యుత్ ప్లాంట్తో స్థానిక పరిశ్రమలతో పాటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు కూడా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రధాని తెలిపారు. రాబోయే రోజుల్లో సౌరశక్తే ప్రధాన విద్యుత్ వనరుగా ఉంటుందని ఆయన తెలిపారు.