భారత్ లో కరోనా కేసులు రోజురోజకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,802కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 4,95,512 మంది డిశ్చార్జు కాగా 21,604 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 2,76,685 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 19,135 మంది డిశ్చార్జు కాగా 475 మంది మరణించారు.