కర్నూలు జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మొన్నటి వరకు రెండెంకల సంఖ్యలో నమోదైన కేసులు కాస్తా మూడెంకల సంఖ్యకు మారుతున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసులు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత వారం రోజుల నుంచి జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదైన పట్టణాలు ఐదు ఉన్నాయి. ఆ పట్టణాల్లో లాక్ డౌన్ నిబంధనలు ప్రజలు పాటించకపోవడం వల్లే పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆ ఐదు పట్టణాలివే. కర్నూలు, ఆదోని, నంద్యాల, డోన్, ఎమ్మిగనూరు పట్టణాల్లో అధిక కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పట్టణాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.