బీఎస్ఎఫ్ జవాన్లను కరోనా మహమ్మారి కలవర పెడుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తోందని అధికారులు చెబుతున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 34 మంది బార్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లకు కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా.. 33 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 817 మంది కరోనా నుంచి బయటపడగా.. 526 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో చాలామందికి ఎలాంటి లక్షణాలు లేవని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు సహకరిస్తున్నారని బీఎస్ఎఫ్ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.