ఏపీలో 553 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,884కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 4988 కోలుకోగా 136 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5760 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. నేడు 7 మరణాలు సంభవించాయి. కర్నూల్ లో ఇద్దరు,కృష్ణాలో ఇద్దరు,గుంటూరులో ఇద్దరు,తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 1080,చిత్తూరు 699,తూర్పుగోదావరి 824,గుంటూరు 958,కడప 500,కృష్ణా 1179,కర్నూల్ 1555,నెల్లూరు 522,ప్రకాశం 218,శ్రీకాకుళం 61,విశాఖపట్నం 407,విజయనగరం 99,పశ్చిమ గోదావరి జిల్లాలో 681 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి 1730 మందికి రాగా ఇతర దేశాలకు చెందిన వారికి 371 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.