హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మార్చిలో తలపెట్టిన జీఎస్ఎల్వీ ఎఫ్ 09 ప్రయోగం సాంకేతిక కారణాలతో ప్రస్తుతానికి రద్దు చేసుకుంటున్నట్టు ఇస్రో వెల్లడించింది. కాగా, అధిక బరువైన ఉపగ్రహాలను నింగిలోకి పంపించే దిశగా ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో తలపెట్టిన సంగతి తెలిసిందే. రాకెట్ నిర్మాణంలో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా మార్చిలో జరగాల్సిన జీఎస్ఎల్వీ ఎఫ్ 09 ప్రయోగం నెల పాటు వాయిదా వేస్తున్నామని, ఏప్రిల్ లో ఈ ప్రయోగం ఉంటుందని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు.