ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌ నీతిమాలిన రాజకీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 01:46 AM

 -ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌


 -పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే అడ్డుకుంటున్నారు  


-రంగారెడ్డి ప్రాజెక్టులు మా్త్రం కావాలని అడుగుతున్నారు 


-పాదయా్తల్రు, బహిరంగ సభలతో పనులు కావు  


-ప్రాజెక్టులపై దిగ్విజయ్‌ స్పష్టమైన వైఖరిని చెప్పాలి  హరీశ్‌ రావు డిమాండ్‌


తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నీతిమాలిన రాజకీయం చేస్తూ అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.


వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, మేజర్‌న్యూస్‌ :  ఓ పక్క  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు  పనులు జరుగకుండా అడుగడుగునా అడ్డుకుం టున్న పాలమూరు జిల్లా నేతలు, అదే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టు పను లను తర్వగా పనులు పూర్తి చేయాలని పాధయా త్రలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయడం ఎంత వరకు సమాంజసం అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి త…న్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. నేడు పరిగిలో జరుగనున్న బహిరంగ సభకు ము ఖ్యఅతిధిగా విచ్చేస్తు న్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలపై తన స్పష్టమైన వైఖరిని ప్రజ లకు తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివారం వికారాబాద్‌కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సభకు విచ్చేసిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా సీఎం కేసీఆర్‌ 4 జిల్లాలకు నీరంధించి సస్యశామ లం చేసేందుకు కంకణం కట్టుకున్నారని కాని కాం గ్రెస్‌ పార్టీ నాయకులు ప్రాజెక్టు నిర్మాణానిి  అడ్డం పడుతున్నారని అన్నారు. ప్రాజెక్టు పనులు నిలిపివే యాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహబూబ్‌నగర్‌ నాయకుడు హర్షవర్దన్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లో కేసు నమోదు చేశారని దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే కూడా చేయలేకపోయమని ఆయన అన్నారు. ఓ జిల్లాలో కేసులతో ప్రాజెక్టు నిర్మా ణాలు అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు,మరో జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడం లేదని ప్రజలకు తప్పుడు సమా చారాన్ని అందిస్తున్నారని ఆయన విమర్శించారు.కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తున్నారో అసెంబ్లీలో తెలిపిందని అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో 34 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలేక పోయిందని ఆయన ఎద్దెవ చేశారు.కాంగ్రెస్‌ పార్టీ 2008 సంవత్స రంలో ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 2014 వరకు ఎందుకు పూర్తి చేయాలేదని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సర్వే,డిజైన్‌ పేరుతో రూ.15కోట్ల పనులు చేసి రూ.100 కోట్ల బిల్లుల లేపరని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల నిర్మా ణంలో భారీగా అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు.ఈ అవినీతి పై తెల ంగాణ ప్రజలకు దిగ్విజయ్‌సింగ్‌ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.అదే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను రూ.6 నుంచి 8 లక్షలు చెల్లించి తీసుకుంటుంటే కాంగ్రెస్‌ పార్టీ భూసేకరణలో టీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతి కి పాల్పడుతుందని ఆరోపణలు చేయడం చాలా దారుణమన్నారు.కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేయకుండా బంగారు తెలంగాణ అభివృద్ది కి సహకరించాలని ఆయన అన్నారు.కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లా 5 లక్షల ఎకరాలకు నీరందిస్తామని ఆయన తెలిపారు. ఈ నీటిని త్రాగునీరుగా, సాగునీరు, పరిశ్రమలకు అందిస్తామని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com