కర్నూలు,సూర్యప్రతినిధి: నంద్యాలలో నేను చేసిన అభివృధ్ధిని చూసి ఓర్వలేకనే శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారుతున్నారని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ శిల్పామోహన్ రెడ్డితో మాకెలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేవని ఆమె తెలిపారు. శిల్పా చక్రపాణిరెడ్డి సహకారంతో నంద్యాలను అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు. అందరికీ పక్కా ఇళ్లు, పింఛన్లు మంజూరు చేశామని చెప్పారు.