ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 436 మార్గాల్లో రోడ్డెక్కిన 1,683 బస్సులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 11:34 AM

ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్ డౌన్ వల్ల రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు పరుగులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు అంటే 17 శాతం బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఆన్‌లైన్ బుకింగ్ నిన్నటి నుంచే ప్రారంభమైంది. ఇకపోతే ఛార్జీలు పెంచబోమని ఆర్టీసీ ముందుగానే చెప్పింది. అయితే 50 శాతం మందితోనే బస్సులు నడపనున్నట్లు తెలిపింది. బస్సుల్లో కండక్టర్లు ఉండరు. అన్ని బస్సులకు ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని ఏపీ సర్కార్ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com