ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 21 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. తాజాగా ఈ రోజు ఏపీ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఈ ఒక్క రోజే ఇప్పటి వరకు 44 కేసులు నమోదయినట్లు స్పష్టం చేశారు. నిన్నటి 43 కేసులతో కలుపుకుంటే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కు చేరుకున్నాయి. కేవలం 12 గంటల వ్యవధిలోనే 43 కేసులు పెరగడంతో ప్రభుత్వంలో కలవరం మొదలైంది. తాజాగా ఈ రోజు నమోదైన 43 కేసుల్లో చిత్తూరులో 5, తూర్పు గోదావరిలో 2, కడపలో 15, కష్ణాలో 1, నెల్లూరులో 2, ప్రకాశంలో 4, విశాఖలో 1 పశ్చిమ గోదావరిలో 13 కేసులు ఈ ఒక్క రోజే నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. దీంతో కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే విశాఖలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 87కి చేరింది. దీనికి సంబంధించిన మీడియా బులెటిన్ ను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.
జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి :
విశాఖపట్నం: 11
తూర్పు గోదావరి: 6
కృష్ణా జిలా: 6
గుంటూరు: 9
ప్రకాశం: 15
నెల్లూరు: 3
చిత్తూరు:6
కర్నూలు: 1
అనంతపురం - 2
కడప - 15
పశ్చిమ గోదావరి - 13