ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 44 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగవని, అందర్నీ పాస్ చేస్తారని వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. పరీక్షలను కచ్చితంగా నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. పరీక్షలు జరగవంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు. లాక్డౌన్ పూర్తయ్యాక షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా, మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఐతే... వాటిని రాబోయే రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అటు.. కరోనా విజృంభించడంతో ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందర్నీ పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షలు రాయకుండానే విద్యార్థులంతా పై తరగతికి ఎలిజిబుల్ అయ్యారు.