శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం లో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు జులై చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివౄఎద్ధి, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడు తూ, తాగునీటి కార్పొరేషన్ విధివిధానాలను వచ్చే మంత్రి వర్గ సమావే శంలోపు పూర్తి చేయాలని, తాగునీటి కార్పొరేషన్ కు, శాఖలకు మధ్య సమన్వ యం అవస రమని, స్వచ్ఛ గ్రామాలకు పోటీ నిర్వహించి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచిం చారు. వర్షాకాలంలో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబల కుండా అప్రమత్తంగా ఉండాలని, ఉపాధి హామీ వేతనాలు త్వరితగతిన చెల్లించాలని ఆదేశించారు.