ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వినియోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2017, 12:40 AM

 -సంక్షిప్త సందేశంతో భావం 


 -అంకెలు, అక్షరాల సంేకతాలు 


 -విస్తృతంగా అంతర్జాలం వినియోగం 


 -యువతరం ఆసక్తి 


(అమరావతి- సూర్య ప్రధాన ప్రతినిధి) :ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ ఫోన్‌ దర్శనమిస్తుంది. అంతే కాదు నేడు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం విస్తతంగా పెరిగింది. క్షణం తీరిక దొరికితే చాలు ఏదో ఒక మెసేజ్‌లు చేయడం, యాప్‌లు పరిశీలించడం వంటివి జిల్లా యువత చేస్తున్నారు. రకరకాల కంపెనీల స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ధరల్లో ఉండటంతో వీటి వినియోగం పెరిగింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు రెండు, మూడు రోజుల్లో ఇంటికే తెచ్చి ఇస్తున్నారు ఆయా సెల్‌ కంపెనీల సిబ్బంది. ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్ల కోసం ఆర్డర్‌ చేసే యువత జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్నారు. అంతే కాకుండా సెల్‌ కంపెనీలు వాయిదాల పద్ధ్దతి(ఈఎంఐ)పై కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించడంతో వీటి వినియోగం పెరుతోంది. వీటి ద్వారా జిల్లా యువత ఆంగ్ల అక్షరాలు, అంకెలను కలిపి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని ఒకరికి ఒకరు పంపించుకుంటున్నారు. జిల్లాలోని యువత తోటివారికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సంకేతాలను పంపించుకుంటున్నారు. ఆంగ్ల అక్షరాలతో పాటు అంకెలను కలిపి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సందేశం రూపంలో పంపిస్తుండటం ప్రత్యేకమైంది. ప్రస్తుతం మరింత సక్షిప్తంగా సమాచారం అందిస్తున్నారు. మరికొందరు సంకేతాలతోనే భావవ్యక్తీకరణ చేస్తున్నారు. చరవాణిలో ఒక సందేశంలో గరిష్టంగా 130 వరకు అక్షరాలు టైప్‌ చేయవచ్చు. మరికొన్ని వాటిలో 165 వరకు నింపే అవకాశం ఉంటుంది. అక్షరాలు, అంకెలతో భావం మారకుండా సూక్ష్మ సందేశాలతో తమ భావాలను యువత పంచుకుంటున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి యువతీ, యువకుడు అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. ఆయా కంపెనీలు ఉచిత ప్యాకేజీలు, తక్కువ ధరలకు జీబీలు ఇవ్వడంతో యువత ఆకర్షితులవుతున్నారు. సామాజిక వెబ్‌సైట్లు, ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు తదితర మాధ్యమాల్లో స్నేహితులు, బంధువులతో అనుసంధానమవుతున్నారు. ఫోన్‌ చేసి మిత్రులతో సంభాషించాలంటే కాల్‌ ధర అధికమవుతుంది. ఈ నేపథ్యంలో అంతర్జాలం ద్వారా ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వారి భావాలను పంచుకుంటున్నారు. మొదట్లో మాట్లాడుకోవాలనుకొనే పదాలన్నింటినీ టైప్‌ చేసుకొనేవారు. ప్రస్తుతం సమయాన్ని ఆదా చేసుకుంటూ సంక్షిప్తంగా పంపుతున్నారు.


జిల్లాలో వినియోగం


జిల్లాలో 28 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో 23 లక్షల మంది చరవాణిని వినియోగించిచేవారు ఉంటే వీరిలో దాదాపుగా 20 లక్షల మంది స్మార్ట్‌ ఫోన్లను వినియోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో మంచిది. లక్ష్యం దిశగా సాగితే విజ్ఞానం పెంపొందించుకోవచ్చు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతరత్రా యాప్‌లు డౌన్‌లోడ్గ చేసుకొని సక్రమంగా వినియోగిస్తే ఎంతో లాభసాటిగా ఉంటుంది. జిల్లాలో 75 శాతం మంది యువతరం స్మార్ట్‌ ఫోన్లను వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


తరచూ సూక్ష్మసందేశాలతో


స్నేహితులు, మి్త్రులకు సూక్ష్మ సందేశాలను పంపించడాన్ని గత కొంత్క్ష కాలంగా అలవాటుచేసుకున్నాను. మొత్తం పదం అంతా టైప్‌ చేయాలంటే సమయం ఎక్కువ పడుతుంది. రెండు, మూడు అక్షరాలతో భావం వచ్చేలా సందేశాన్ని పంపించుకుంటున్నాం. ఇలా చాలా సులువుగా ఉంటుంది. సమాచారం త్వరగా ఒకరికి ఒకరం సంక్షిప్త సమాచారం ద్వారా చేర్చుకుంటున్నాం. మా భావాలను పంచుకుంటున్నాం.


సంక్షిప్త సందేశాలు పంపించడం ఎంతో సులువు


సంక్షిప్త సందేశాలు పంపించడం ఎంతో సులువ్కెంది. స్మార్ట్‌ఫోన్‌లో సంక్షిప్త సందేశాలు పంపించే సమయంలో భావాలను వ్యక్తీకరించేందుకు అక్షరాలు, అంకెలతో పాటు సింబల్స్‌ కూడా పంపింస్తుంటాను. స్నేహితులతో నిత్యం ఈ విధంగా సులువుగా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా త్వరితగతిన భావాలను తక్కువ సమయంలో పంచుకుంటున్నాను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com