తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం స్వామివారి సర్వ దర్శానానికి పది గంటలు, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం మీద స్వామి వారిని 98,945 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ఆలయ ప్రాంగణం, లడ్డూ కౌంటర్లు, బస్టాండ్లు, విచారణ కార్యాలయాలు, ఉచిత సముదాయాలు, అన్నప్రసాద భవనం, వాణిజ్య సముదాయాలు కిక్కిరిసి ఉన్నాయి.