ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు సీఎం జగన్ వివరించారు. విద్య, వైద్య, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను సీఎం జగన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. మానవవనరులపై పెట్టుబడి ద్వారా అభివృద్ధి ఫలితాలు వస్తాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం అన్నారు.