దేశాన్ని వణికించిన నిర్భయ అత్యాచార ఘటనలో ఉరిశిక్ష పడిన నలుగురు కిరాతకులను ఎలా ఉరి తీయబోతున్నారు ? ఉరి తీయబోయే ముందు ఆ కిరాతకులను మానసికంగా ఎలా సిద్ధం చేస్తారు ? అసలు ఉరి తీయబోయే రోజు ఏం జరుగుతుంది ? ఉరి తీయబోయే ముందు జరిగే ఏర్పాట్లు ఎలా వుంటాయి ? ఇదే విషయం చాలామందిలో చర్చనీయాంశం. ఆ కిరాతకులను ఉరి తీసే రోజు ఉదయం 3 గంటలకే నిద్ర లేపుతారు. వాళ్ళ స్నానం కోసం వేడినీళ్ళు, చన్నీళ్ళు రెండూ సిద్ధం చేస్తారు. ఆ తర్వాత కొత్తబట్టలు ఇచ్చి వేసుకోమంటారు. ఆ తర్వాత వారికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఆహారం తర్వాత వాళ్ళు టీ అడిగినా, కాఫీ అడిగినా, కూల్ డ్రింక్ అడిగినా మద్యం తప్ప మిగిలినవి ఇస్తారు. మద్యం తాగితే మతిస్థిమితం కోల్పోతుంది. స్పృహలో లేని వ్యక్తిని ఉరి తీయకూడదని ఒక నిబంధన వుంది. కాబట్టి మద్యం ఇవ్వరు. ఆ తర్వాత దాదాపు గంటసేపు వారిని ఒంటరిగానే వదిలేస్తారు. ఈ ఒంటరి సమయంలో తమ గతాన్ని, కుటుంబసభ్యులను, తమ అనుభవాలను వాళ్ళు నెమరువేసుకునే అవకాశం ఇవ్వడం కోసమే ఒంటరిగా వదిలేస్తారు. తర్వాత వారికి ఇష్టమైన మతగ్రంధాలను చదువుకోవడానికి అందచేస్తారు. తమ ఇష్ట దైవాన్ని ప్రార్ధించుకునేందుకు వారి అడిగిన దేవుళ్ళ చిత్రపటాలను ఇస్తారు. ఆ తర్వాత జైలు డాక్టర్ వచ్చి వారి శారీరక, మానసిక పరిస్థితిని అంచనా వేస్తారు. డాక్టర్ ఇచ్చే నివేదిక ప్రకారం ఉరి తీసేందుకు సన్నద్దమవుతారు. నేరస్తుడిని ఉరి కంబం ప్రదేశానికి తీసుకువస్తారు. ఆ తర్వాత ఓ నల్లటి ముసుగు వారి ముఖానికి కప్పుతారు. చేతులు రెండూ వెనక్కి కట్టేస్తారు. అనంతరం ఎక్స్యూటివ్ మేజిస్ట్రేట్ డెత్ వారెంట్ లో వున్న వ్యక్తి అతనో కాదో పరిశీలిస్తారు. పేరు పెట్టి పిలుస్తాడు. ఉరి శిక్ష పడ్డ ఖైదీకి తెలిసిన భాషలో కోర్టు ఆదేశాలను చదివి వినిపిస్తాడు. ఆ తర్వాతనే ఉరి శిక్ష తీసే తలారీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు