విజయవాడలో జరిగిన ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు ముగ్గురు ఎంపీలు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల క్రితం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్... ఈ సమావేశానికి హాజరుకాలేదు. జీవీఎల్, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోదర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముగ్గురు ఎంపీలు రాకపోవడం హాట్ టాపిక్గా మారింది. ఈ ముగ్గురు టీడీపీ నుంచి బీజేపీలో ఇటీవలే చేరారు.
అమరావతి రాజధాని విషయంలో కేంద్రం వైఖరిపై సుజనా చౌదరి అసంతృప్తితో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో పొత్తు విషయంలోనూ ఈ ముగ్గురు ఎంపీలను బీజేపీ హైకమాండ్ దూరంగా పెట్టింది. దీంతో వీరికి ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేదేమో అనే చర్చ కూడా సాగుతోంది. బీజేపీ చేపట్టిన ఏ కార్యక్రమాల్లోనూ ముగ్గురు ఎంపీలు పాల్గోనకపోవడంపై వీరు బీజేపీలోనే ఉన్నారా..? అనే అనుమానం కాషాయ కార్యకర్తల్లో నెలకొంది.