హైదరాబాద్ లో దిశ హత్యాచార ఘటన మరువక ముందే 19ఏళ్ల మహిళపై కర్నాల్ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. టోల్ ప్లాజా దగ్గరున్న టాయ్ లెట్ కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచకులు.. తమ మొబైల్ నెంబర్లు కూడా ఇచ్చి మరీ వెళ్లారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఫిబ్రవరి 16, ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది.
పంజాబ్ కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను చూడటానికి పానిపట్ కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఆదివారం రాత్రి ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో తమ సన్నిహితుల నుంచి రూ. 2వేలు తీసుకోవడానికి రాత్రి 11 గంటల సమయంలో కర్నల్ టోల్ ప్లాజా దగ్గర ఆగారు. ఈ క్రమంలో మహిళ(19) టాయ్ లెట్ కోసం వెళ్లింది.