ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఇవ్వాలన్న నిర్ణయం మంచిది : పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 02:06 PM

సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఇవ్వాలన్న నిర్ణయం మంచి పరిణామం అని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అన్నారు. జగన్ సర్కార్ నిర్ణయం ప్రీతి కుటుంబానికి ఊరటనిచ్చే విషయం అని పవన్ అన్నారు. ఇప్పటికే కేసు విచారణ ఆలస్యమైందని అన్నారు. సిబిఐ విచారణ వేగవంతం చేయాలని అన్నారు. కర్నూలులో 2017లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి రిఫర్‌ చేయనుంది.  ఈ మేరకు సీఎం జగన్‌ ప్రీతి కుటుంబ సభ్యులకు వెల్లడించిన విషయం తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com