వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను రస్ అల్ఖైమా నిధులను దుర్వినియోగం చేసినందుకే సెర్బియా పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. కేసు తేలేవరకు సెర్బియా వదిలి వెళ్లిపోవద్దని నిమ్మగడ్డకు ఆంక్షలు జారీ చేశారన్నారు. ఏడు నెలల నుంచి నిమ్మగడ్డ సెర్బియాలోనే ఉండిపోయారని వెల్లడించారు.
ఈ కేసులో ఎక్కడ ఇరుక్కుంటానోనని సీఎం జగన్ భయపడుతున్నారన్నారు. సీఎం జగన్ నుంచి డబ్బు వసూలు చేసి ఇవ్వాలని... కేంద్రానికి రస్ అల్ ఖైమా లెటర్ రాసిందని తెలిసిందని వర్ల రామయ్య వెల్లడించారు. తనను తాను రక్షించుకునేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారన్నారు. కేసు నుంచి బయటపడేయాలని మోదీని జగన్ వేడుకున్నారన్నారు. ఏపీ పరువు అవినీతిలో ఖండాలు దాటి వెళ్లిపోయిందని వర్ల రామయ్య పేర్కొన్నారు.