సీఎం జగన్ సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతూనే పరిపాలన పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అవినీతి పై ఆయన కన్నెర్ర చేస్తున్నారు. మంగళవారం ఏపీ వ్యాప్తంగా వివిధ మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం పై రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఫిర్యాదులు రావడంతో సీఎం జగన్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. నెల్లూరు,గుంటూరు,కాకినాాడ,పొద్దుటూరు కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ రికార్డులను పరిశీలించారు. అవకతవకలు ఉంటే ప్రభుత్వానికి నివేదిస్తామని, ఇది సాధారణ తనిఖీలే అని ఏసీబీ అధికారులు తెలిపారు. వరుసగా ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.