ఏపీ విద్యార్థులు, పీఓటీపీఎల్ ట్రైనీలు ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. చైనా వుహాన్ సిటీకి శిక్షణ కోసం వెళ్లి చిక్కుకుపోయారు. జనవరి 23 నుంచి చైనాలోనే ఉండిపోయారు. భారత ప్రభుత్వం వారిని చైనా నుంచి ఢిల్లీకి రప్పించింది. అధికారులు వారిని ఢిల్లీలో 14 రోజులపాటు ఐసోలేషన్లో ఉంచారు. అధికారులు వారికీ వైద్య పరీక్షలు పూర్తి చేసి పంపించారు. విద్య అధికారులు విద్యార్థులకు కోవిడ్ లేదని తేల్చి చెప్పారు.